Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. నూతన సచివాలయ నిర్మాణం, నియంత్రిత పద్ధతిలో పంటల సాగు, కరోనా తీవ్రత, విద్యారంగంపై దాని ప్రభావం, తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు... తదితరాంశాలపై మంత్రివర్గంలో చర్చించి, పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏండ్లకు పెంచే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నారని సమాచారం.