Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెల్లటి మల్లె పూవు లాంటి దుస్తులు, మోములో అంతకుమించి అమాయకత్వం తొంగిచూసే చిరునవ్వు... మూడుసార్లు ఎమ్మెల్యే అయినా ఎక్కడా కనపడని దర్పం... అందరితోనూ కలుపుగోలుతనం...' సింపుల్గా చెప్పాలంటే ఇదీ సున్నం రాజయ్య వ్యక్తిత్వం. అది అసెంబ్లీ అయినా, ఇందిరాపార్కు ధర్నా చౌక్ అయినా... ఆయనది ఒకే మాట, తుదికంటా నడిచింది ఎర్రబాట.
- ప్రజా సమస్యలపై నిరంతర గళం...
- నాటి విద్యుత్ పోరాటం నుంచి నేటి పోడు భూముల పోరు దాకా
అలుపెరుగని సున్నం రాజయ్య
- పలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతానికే వన్నె తెచ్చిన నేత
- మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా బస్సులోనే పయనం,కుదిరితే ఆటో.. లేదంటే మోటారు సైకిల్పై ప్రయాణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తెల్లటి మల్లె పూవు లాంటి దుస్తులు, మోములో అంతకుమించి అమాయకత్వం తొంగిచూసే చిరునవ్వు... మూడుసార్లు ఎమ్మెల్యే అయినా ఎక్కడా కనపడని దర్పం... అందరితోనూ కలుపుగోలుతనం...' సింపుల్గా చెప్పాలంటే ఇదీ సున్నం రాజయ్య వ్యక్తిత్వం. అది అసెంబ్లీ అయినా, ఇందిరాపార్కు ధర్నా చౌక్ అయినా... ఆయనది ఒకే మాట, తుదికంటా నడిచింది ఎర్రబాట.
భద్రాచలం శాసనసభా నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎం) నుంచి 1999,2004,2014లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా నాయకుడాయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజయ్య ఆదివాసీ, గిరిజన పోరాటాలతోపాటు అనేక ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. నాటి చంద్రబాబు, వైఎస్ నుంచి నేటి కేసీఆర్ దాకా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా... తన నియోజకవర్గానికి సంబం ధించిన సమస్యలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాలను నిలేశారు. తద్వారా వాటి పరిష్కారానికి కృషి చేశారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజయ్య.. చంద్ర బాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన విద్యుత్ పోరా టంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2004లో గెలిచారు. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ క్రమంలో 2007లో జరిగిన భూ పోరా టంలోనూ రాజయ్య సీపీఐ (ఎం) ప్రజా ప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన తిరిగి 2014లో గెలుపొందారు. ఆ సమయంలో శాసనసభకు సీపీఐ (ఎం) నుంచి గెలిచిన ఏకైక ప్రతినిధి ఆయన ఒక్కరే కావటం గమనార్హం. అయినా ప్రజా సమస్యలపై తన వాణిని, బాణిని సమర్థవంతంగా వినిపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 తర్వాత పోడు భూములు, పోలవరం ముంపు ప్రాంతాలు, బాధితులకు నష్టపరిహారం తదితరాంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని పరిష్కరించాలంటూ అసెంబ్లీలో రాజ య్య గళమెత్తారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు, సంబంధిత మంత్రులకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఇదే సమయంలో భద్రాచలం నియోజ కవర్గానికి ఒక కొత్త చిక్కొచ్చి పడింది. ఆ నియోజ కవర్గంలోని అత్యధిక గ్రామాలు ఆంధ్రాలో కలిసిపోయాయి. భద్రాచలం పట్టణంతోపాటు కొన్ని గ్రామాలే తెలంగాణలో మిగిలిపోయాయి. దీంతో 'నా నియోజకవర్గం తెలంగాణలో ఉంది... నాకు ఓటేసిన వారిలో అత్యధిక మంది ప్రజలు ఆంధ్రాలో ఉన్నారు...అందువల్ల నాకు ఆంధ్రా అసెంబ్లీలో కూడా అవకాశమివ్వండి... అక్కడి ప్రభుత్వం నిధులి వ్వకపోయినా ఫరవాలేదు.. కానీ నాకు ఓటేసిన ప్రజల తర పున మాట్లాడే అవకాశమైనా ఇవ్వండి...' అంటూ రాజ య్య అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తనకు రెండు రాష్ట్రాల శాసనసభల్లో అవకాశం కల్పించాలంటూ హైకోర్టులో కేసు వేశారు. ఢిల్లీకి వెళ్లి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్వ యంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని రాజయ్య అసెంబ్లీలో వివిధ సందర్భాల్లో గుర్తుచేశారు. పాఠశాలలు, ఆస్పత్రులతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో వేలాది ఖాళీలున్నాయంటూ ఆయన అంకెలతో సహా వివరిం చేవారు. వాటన్నింటినీ భర్తీ చేయటం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలం టూ కోరారు. 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినా దాలపై తెలంగాణ ఏర్పడింది. వీటిలో నియామకాల సంగతేదంటూ పదేపదే ప్రశ్నించేవారు. దీంతోపాటు ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో చెక్డ్యాములు, ఫైర్ స్టేషన్లు, గిరిజన పాఠశాలలు, హాస్టళ్లను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలనీ, ప్రస్తుతమున్న వాటిలో మౌలిక వస తులను కల్పించాలంటూ కోరేవారు. తెలంగాణ ఏర్పడ్డాక భద్రాచలంతోపాటు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలు, మైనారిటీ స్కూళ్లు, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, అమ్మాయిలకు డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు సూచించారు. తన నియో జకవర్గానికి సంబంధించి తెలంగాణలో చదివిన వారికి ఇక్కడ, ఆంధ్రాలో చదువుకున్న వారికి అక్కడ... ఉద్యోగా వకాశాలు కల్పించాలంటూ రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పాలకులు పట్టించుకోకపోవటంతో ఆందోళనలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులకోసం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరాపార్కు వద్ద సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహారదీక్షలో ఆయన పాల్గొన్నారు. పోల వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆదివాసీల జీవితాలు ధ్వంసమ వుతాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆ సమస్యపై నిర్వహించిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనీ, వారికి 12 శాతం గిరిజనుల రిజర్వే షన్లు కల్పించాలని కోరారు. కనీసం వారి జనాభా లెక్కల ప్రకారం 9 శాతం రిజర్వేషన్లు అయినా కల్పించాలంటూ ఆందోళనలు నిర్వహించారు.
రాజయ్య... సింపుల్ సిటీకి చిరునామా...
ఇలా ఇటు ప్రజా ప్రతినిధిగా, అటు ప్రజా నాయకుడిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని, ప్రజా సమస్యలపై తుదికంటా రాజీ లేని పోరాటాలు చేసిన రాజయ్య మర ణాన్ని ఆదివాసీలు, ప్రజలు, పార్టీ నేతలు జీర్ణించు కోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు రాజయ్య వ్యక్తిత్వాన్ని, ఆయన మచ్చలేని జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఇందుకు బలమైన కారణాలున్నాయి. సహజంగా ప్రజా ప్రతినిధి అనగానే... కార్లు, సెక్యూరిటీ సిబ్బంది, మందీ మార్బలం... ఇలా చాలా హంగామా ఉంటుంది. రాజయ్య మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన... ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లినా ఆర్టీసీ బస్సు లేదా ఆటో ఎక్కే వారు. మోటారు సైకిల్పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఎమ్మెల్యే అంటే కారులోనే వెళ్లాలనుకునే అభిప్రా యం ఉన్న ఈ రోజుల్లో అసలు సిసలు ప్రజా ప్రతినిధి అంటే ప్రజల్లో, వారితో మమేకమై ఉండేవారే అని ఆయన నిరూపిం చారు. రాజయ్య వెనుక ఏనాడూ హంగూ ఆర్భాటమూ ఉండదు. కొత్తవారెవరైనా ఆయన్ను చూస్తే అసలు ప్రజా ప్రతినిధి అని అనుకోరు. ఆయన ఆహార్యం, వ్యవహారశైలి అంత సిం పుల్గా, సాదాసీదాగా ఉంటాయి. నియోజకవర్గం భద్రా చలంలో సైతం ఎక్కడికైనా వెళ్లాలన్నా రాజయ్య... బైకునే ఎక్కేవారు. చాలా సందర్భాల్లో భద్రాచలం నుంచి హైదరాబాద్కి ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే శాలరీలో... సగం పార్టీకి ఇచ్చేవారు. మిగతా సగాన్ని తన ఖర్చుల కోసం వాడుకునేవారు.
సచివాలయ సెక్యూరిటీ అడ్డగింత...
ఓసారి రాజయ్య సాయంత్రం సమయంలో ఆటోలో తెలంగాణ సెక్రటేరియట్కి వచ్చారు. ఆటోని లోనికి అనుమతివ్వాలంటూ సెక్యూరిటీని కోరారు. అందుకు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. తాను ఎమ్మెల్యేనంటూ రాజయ్య తన ఐడీ ప్రూఫ్ చూపించారు. అయినా సరే.. వాళ్లు నమ్మలేదు. 'ఎమ్మెల్యే ఎక్కడైనా ఆటోలో వస్తారా..?' అంటూ ప్రశ్నలు కురిపించారు. దాదాపు 20 నిమి షాలపాటు ఈ తతంగం నడిచింది. చివరకు కొందరు మీడియా ప్రతినిధులు రాజయ్యను గుర్తించి... సెక్యూరిటీ సిబ్బందితో వాదించి, ఆటోతో సహా ఆయన్ని లోనికి పంపించారు. ఈ ఘటనతో వణికిపోయిన సెక్యూరిటీ సిబ్బంది.. రాజయ్య పైఅధికారులకు ఫిర్యాదు చేస్తారేమో నని భయపడ్డారు. బయటకు వచ్చాక ఇదే విషయాన్ని జర్న లిస్టులు రాజయ్య వద్ద ప్రస్తావిస్తే... 'భలే వాళ్లే మీరు... వాళ్లపై ఫిర్యాదు చేసి నేను సాధించేదేముంది? వాళ్ల పొట్టకొట్టడం తప్పితే...' అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. దటీజ్ రాజయ్య.
పదవిని వదులుకుంటా.. పార్టీని కాదు...
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజయ్యను తమ పార్టీలోకి రప్పించేం దుకు అధికార పార్టీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కీలక మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ఆయనకు నచ్చజెపి.. తమవైపు లాక్కునేందుకు ప్రయ త్నించారు. ఇలా ఆయన్ను ఆకర్షించేందుకు మూడుసార్లు వ్యూహాలు పన్నారు. ఇప్పుడు, అప్పుడు కీలకంగా ఉన్న ఓ మంత్రి 'రాజన్నా... మీ పిల్లలకు ఉద్యోగాలిస్తాం. సీలేరు పవర్ ప్లాంట్లో వాటా ఇస్తాం, భూములిస్తాం, ఇతరత్రా సెటిల్మెంట్లు చేస్తాం. మీకు ఏది కావాలంటే అది ఇస్తాం... ఎందుకే అక్కడ (ప్రతిపక్షంలో) ఒంటరిగా ఉండటం.. మా పార్టీలోకి వచ్చేరు... అల్రెడీ ఒక సోదరుడు (ఇతర వామపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే) వచ్చేశాడు. నువ్వు కూడా వచ్చేరు...' అంటూ సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. అందుకు రాజయ్య సున్నితంగా... 'నేను తార్పుడు రాజకీ యాలు చేయను, అవసరమైతే పదవిని వదులుకుంటానే తప్ప పార్టీని వదులుకోబోను...' అని కుండబద్ధలు కొట్టినట్టు నిర్మొహమాటంగా తన వైఖరి చెప్పేశారు. తుదికంటా అదే నిజాయితీతో ప్రజల మనిషిగా వారి మనసుల్లో నిలిచిపోయారు.