Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మాజీ ఎంఎల్ఏ, గిరిజనోద్యమ నేత, ఎర్రజెండా ముద్దు బిడ్డ సున్నం రాజయ్య కన్నుమూత
- దిగ్భ్రాంతిలో సీపీఐ(ఎం) శ్రేణులు
- స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి
- కడసారి చూపునకు కదలి వచ్చిన గిరిజనం
-నిరాడంబర నాయకులు సున్నం రాజయ్య
-ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
రాజమహేంద్రవరం: భద్రాచలం మాజీ ఎంఎల్ఎ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజయ్య (60) హఠాన్మరణంతో మన్యం ఒక్కసారిగా మూగబోయింది. గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం పోరు సాగించిన రాజయ్య ఇక లేరన్న వార్త ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో విషాదాన్ని నింపింది.అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య సోమవారం అర్థరాత్రి మృతి చెందారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరికి పాజిటివ్ రావడం, రాజయ్యకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు నెగెటివ్ వచ్చింది. డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలు మాత్రం బయటపడ్డాయి. తీవ్ర అస్వస్థతకు గురైన రాజయ్యను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించేలోగా తుది శ్వాస విడిచారు. దీంతో వామపక్ష, అభ్యుదయవాదులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా విఆర్పురం మండలం సున్నంవారిగూడెంలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన రాజులు, కన్నమ్మ ఏకైక సంతానం రాజయ్య. విద్యాభ్యాసం కూనవరంలో పదో తరగతి వరకు సాగింది. రాజయ్యకు భార్య చుక్కమ్మ, నలుగురు పిల్లలున్నారు. కుమార్తెలు లక్ష్మి, స్వరాజ్యం ఇద్దరూ టీచర్లుగా పని చేస్తున్నారు. కుమారుడు చంద్రర్రావు కాంట్రాక్ట్ టీచర్గానూ, మరో కుమారుడు రామరాజు సచివాలయ ఉద్యోగిగా పని చేస్తున్నారు. చిన్నమట్టపల్లి పంచాయతీ సర్పంచిగా ప్రజాసేవలందించడం ప్రారంభించిన రాజయ్య, మూడుసార్లు భద్రాచలం ఎంఎల్ఏగా సేవలందించి, ఉమ్మడి రాష్ట్రాల ఆదర్శ ఎంఎల్ఏగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
సున్నం రాజయ్య మరణం పట్ల
రాఘవులు దిగ్భ్రాంతి
- తమ్మినేని, వీఎస్ఆర్ సహా పలువురి నివాళి
- పార్టీ పట్ల గొప్ప విశ్వాసం గల నేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ (ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రముఖ నాయకుడు సున్నం రాజయ్య మరణంపట్ల ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ పట్ల గొప్ప విశ్వాసం గల నేతను కోల్పోయామని అన్నారు. రాజయ్య మరణంపట్ల తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్ వద్ద రాజయ్య సంతాప సభను నిర్వహించారు. రాఘవులుతోపాటు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, టి.జ్యోతి, డీజీ నర్సింహారావు, జి.రాములు, జాన్వెస్లీ తదితరులు రాజయ్య చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు.
రాఘవులు మాట్లాడుతూ... కరోనా మూలంగా సున్నం రాజయ్యతోపాటు ఏపీలో సీనియర్ నాయకుడు షడ్రక్ మరణించటం అత్యంత బాధాకరమని అన్నారు. వారి మరణం పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆశయాల సాధన కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఒకవైపు కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండగా.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పూర్తిగా గాలికొదిలేశాయని చెప్పారు. ఇప్పుడు కోవిడ్ కష్టాలతోపాటు అది సృష్టిస్తున్న నష్టాలు, ఇబ్బందులతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిందేనని చెప్పారు. ఇదే సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలనీ, వారికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తమ్మినేని మాట్లాడుతూ... మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన రాజయ్య ఆదివాసీలు, గిరిజనులతో పాటు మిగతా ప్రజానీకంలో సైతం అత్యంత ఆదరణ కలిగిన నాయకుడని చెప్పారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత, అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధిగా, బయట ప్రజా నాయకుడిగా ఆయన చేసిన పోరాటాలు పార్టీని బలోపేతం చేశాయని నివాళులర్పించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ... రాజయ్య, షడ్రక్ మరణం పార్టీకి, ప్రజా సంఘాలకు, ఉద్యమాలకు తీరనిలోటని నివాళులర్పించారు. వారి అంకితభావం, నిబద్ధత నేటి కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. రాజయ్య, షడ్రక్ మరణంపట్ల తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
రాజయ్య మతి పట్ల కేటీఆర్ సంతాపం
తారకరామారావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాజయ్య మతి తెలంగాణ సమాజానికి తీరని లోటని , తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జీవితమంతా వారి శ్రేయస్సు కోసం పనిచేశారని కొనియాడారు. రాజయ్య మరణం పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
సీపీఐ, న్యూ డెమోక్రసీ సంతాపం
సీపీఐ(ఎం) సినియర్ నాయకులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు సున్నం రాజయ్య ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడి,్డ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పార్టీ పట్ల అంకితభావంగా నిలిచిన నిబద్ధతగల కమ్యూనిస్టని కొనియాడారు.
ప్రజల కోసం చివరి వరకు నిస్వార్థంగా పని చేసిన ఆదర్శ నేత సున్నం రాజయ్య అని సీపీఐ (ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టి రాష్ట్ర కార్యదర్శి కష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు.
రాజయ్య మృతి దిగ్బ్రాంతి కలిగించింది : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్
ప్రజా నాయకులు, గిరిజనుల హక్కుల కోసం అలుపెరుగకుండా పోరాడిన నేత మాజీ శాసన సభ్యులు సున్నం రాజయ్య మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని ఉపాద్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. రాజయ్య కు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) ఘనంగా నివాళులర్పించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.జంగయ్య, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజయ్య మరణం తీరని లోటు: తెలంగాణ సాహితి, :కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్
సున్నం రాజయ్య మతి రాష్ట్ర గిరిజన ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి తీరని లోటు అని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లభాపురం జనార్థన,కె.ఆనందాచారి అన్నారు. సున్నం రాజయ్య మరణం తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (475) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. రమణారెడ్డి కొప్పిశెట్టి సురేష్, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కెపి. శోభన్ బాబు, అధికార ప్రతినిధి జెబి ఉల్లా ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా సంఘాల సంతాపం
దళిత, గిరిజనుల హక్కుల కోసం అలుపెరుగని ప్రజాపోరాటాలు చేసిన ఆదర్శ ప్రజానేత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆకాల మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని కేవీపీఎస్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, టి స్కైలాబ్ బాబు ప్రగాడ సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అకాల మతి పట్ల తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఆధ్యక్ష, కార్యర్శులు పి.జంగారెడ్డి, టి.సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ సంతాపం తెలిపారు.
ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు మాజీ శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య అకాల మరణం గిరిజన ఉద్యమాలకు తీరని లోటని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అద్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.ధర్మనాయక్, ఆర్.శ్రీరాంనాయక్ అన్నారు. రాజయ్య మరణం దిగ్భ్రాంతి కలిగించిందని అఖిల బారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు కెఎన్. ఆశాలత, మల్లు లక్ష్మి, బి.హైమవతి తెలిపారు. రాజయ్య అకాల మృతి ప్రజా ఉధ్యమాలకు తీరని లోటని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సున్నం రాజయ్య మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని తెలంగాణ రజక వృత్తి దారులసంఘం సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. ఆశయ్య, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరింకల నర్సింహ, ఎం.అడివయ్య, తెలంగాణ క్షౌర వృత్తిదారుల సంఘంరాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చెన్నారం మల్లేష్ , వేముల సైదులు సంతాపం తెలియజేశారు.
సున్నం రాజయ్య రాజకీయాల్లో ఒక ఉదాహరణ : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరాడంబర జీవితం గడిపిన నేతగా రాష్ట్ర రాజకీయాలో ఒక ఉదాహరణగా నిలిచారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంచి మనిషి, మంచి స్నేహితుడు ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
సీఐటీయూ కార్యాలయంలో రాజయ్య సంతాపసభ
మాజీ శాసనసభ్యులు ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నాయకులు సున్నం రాజయ్య సంతాప సభను సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. రాజయ్య చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మృతి కష్టజీవుల ఉద్యమానికి తీవ్ర నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, పాలడుగు భాస్కర్, భూపాల్, ఎస్.రమ, కోశాధికారి వి.రాములు, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, సునీత పాల్గొన్నారు. మాజీ శాసన సభ్యులు సున్నం రాజయ్య అకాల మృతికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు వీఎస్ రావు, రామచంద్రరావు, పద్మ, పి.జయలక్ష్మి, ఖమర్అలీ, పాలడుగు భాస్కర్, ఎన్.ఎల్లయ్య, ఎస్.రమ, భూపాల్, యాదానాయక్, వంగూరు రాములు, ఆర్.కోటంరాజు, పి.సుధాకర్, ఎ.బాలనర్సయ్య, పి.శ్రీకాంత్, కె.సునీత, పి.గణపతిరెడ్డి, వెంకటయ్య, నగేశ్, సుధాకర్, కుమారచారి, గోవర్థన్, బుర్రతిరుపతి, బి.మధు, జె.వెంకటేశ్, జె.కృష్ణారెడ్డి, ఎం.రమేశ్, కె.రమేశ్, వరలక్ష్మి, తదితర నాయకులు ఉన్నారు.
ప్రజా సమస్యల కోసం జీవితాంతం కృషి
- ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సున్నం రాజయ్య మీతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హదయాల్లో నిలిచిపోతారని అన్నారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. నిజాయితీ, నిబద్ధత కలిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కషి చేసిన నాయకులు సున్నం రాజయ్య అనిశాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. తెలిపారు.
రాజయ్య మరణం దుఖాన్ని కలిగించింది
- హరీష్రావు
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను తాను ఎంతగానో గౌరవిస్తాననీ, అలాంటి వ్యక్తి మరణం తనకు తీవ్ర దు:ఖాన్ని కలిగించిందని మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 'నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. పేద ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జన సామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకులు' అని హరీశరావు కొనియాడారు.
మరణంపట్ల
సీపీఐ (ఎం) సంతాపం...
ప్రజా గాయకుడు వంగపండు మరణంపట్ల రాఘవులు, తమ్మినేని తీవ్ర సంతాపాన్ని ప్రకటిం చారు. మొదటి నుంచి వామపక్ష భావజాలం ఉన్న ఆయన.. తన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించారని చెప్పారు. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు ఆయన మరణం తీరనిలోటని నివాళులర్పించారు.
ప్రజా వాగ్గేయకారుడికి
తెలంగాణ సాహితి నివాళి
వంగపండు పాట కాదు ప్రజల ఉద్యమాల బాట అని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లభాపురం జనార్థన,కె.ఆనందాచారి అన్నారు. ఆయన పాటలు 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. మూడు దశాబ్దాలలో 300కుపైగా పాటలు పాడారు. ప్రసాదరావు మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ వ్యక్తం చేసారు.