Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని 24 ప్రయివేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఒక్కరోజే వచ్చాయి. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హెచ్చరిస్తున్నా ప్రయివేటు ఆస్పత్రుల తీరు మారడం లేదు. అధిక ఛార్జీలను వసూలు చేయడం మానడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన వాట్సప్ నెంబర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైద్యానికి అత్యధికంగా రూ.10 వేలకు మించి ఖర్చు కాదని మంత్రి, ఉన్నతాధికారులు, ప్రభుత్వ వైద్యులు చెబుతున్నా, ప్రయివేటులో లక్షల రూపాయలు అడ్వాన్సు కింద కట్టాలని డిమాండ్ చేస్తున్నాయని ఫిర్యాదులందాయి.