Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ జి.సంతోష్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈసారికి మట్టితో తయారు చేసిన సీడ్ గణేష్లను వాడాలనీ, పర్యావరణాన్ని కాపాడాలని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. సీడ్ గణేష్ అనే వినూత్న కార్యక్రమాన్ని వారిద్దరూ బుధవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు, ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించడమే సీడ్ గణేష్ కార్యక్రమం సంకల్పం అన్నారు. స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాలను కలిపి గణపతి విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తామని చెప్పారు. స్వచ్ఛంధ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు.
కుండీలో వినాయకుని విగ్రహాన్ని పెట్టి నిమజ్జనం చేయడం వల్ల అవి మొలకెత్తి చెట్లుగా మారుతాయన్నారు.