Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాస్కర్ మరణంపట్ల గవర్నర్, సీఎం సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్రాంత ఐఏఎస్ అధికారి వి.భాస్కర్ మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వారు వేర్వేరు ప్రకటనల్లో ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్గానే కాకుండా వాణిజ్య పన్నులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మెన్గానూ సేవలందించారని గవర్నర్ తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు.