Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బిపి.ఆచార్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐపీఎస్లు అంకిత భావంతో పని చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బిపి.ఆచార్య అన్నారు. రాష్ట్ర క్యాడర్కు కేటాయించిన 2019 ఐపీఎస్ ప్రొబేషనర్లకు బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో భూమి సంబంధిత చట్టాలు, రికార్డులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది ఐపీఎస్ అధికారులు బాధ్యతాయుతంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించడమే కాకుండా తమ పరిదిని విస్తృత పర్చుకుంటూ ప్రజలకు సేవ చేసి గొప్ప పేరు సంపాదించుకుంటున్నారని అన్నారు. కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టబోయే శిక్షణ ఐపీఎస్లు వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్రం నుంచి టాపర్గా నిలిచిన పెద్ది ధర్తి రెడ్డిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎకె.గోయల్, డాక్టర్ మహ్మద్ అలి రఫత్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పికె.శర్మ, అకాడమీ డీన్ డాక్టర్ గౌతమ్ పింగ్లే, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రావుల పాటి మాధవి, శిక్షణ ఐపీఎస్లు పాల్గొన్నారు.