Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సివిల్స్లో 330 ర్యాంకు సాధించిన సంకీర్త్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ పిలుపు నిచ్చారు. పట్టుదల, కషి ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యాన్నైనా సాధించవచ్చని సింగరేణి కార్మికుని కుమారుడు సంకీర్త్ రుజువు చేశాడని అన్నారు. ఈ మేరకు ఆయనను అభినందిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. పిల్లల లక్ష్యసాధనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమనీ, బెల్లంపల్లి ఏరియాలో ఎక్స్ప్లోరేషన్ విభాగంలో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్న అతని తండ్రి సిరిసెట్టి సత్యనారాయణ మాదిరిగా ఇతర కార్మికులు కూడా తమ పిల్లల ఎదుగుదలకు సహకరించి ప్రోత్సాహించాలనీ, అప్పుడే వారు మంచి విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.