Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్ వెల్లడి
నవతెలంగాణ-ములుగు
అక్రమంగా తరలిస్తున్న 13ల క్షల 92వేల విలువైన 174 కిలోల గంజాయితోపాటు కారును పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లాలోని ఇంచెర్ల ఎర్రి గట్టమ్మ గుడి సమీపంలో బుద వారం పట్టుకున్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రా మ్ సింగ్జి పాటిల్ వివరాలు వెల్ల డించారు. కొందరు గంజాయి తరలి స్తున్నారన్న సమాచారం మేరకు వెం కటాపూర్ ఎస్ఐ నరహరి సిబ్బం దితో వెళ్లి వాహనాల తనిఖీ చేప ట్టారు. పస్రా నుంచి ములుగుకు వస్తున్న నిందితులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నిం చారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకు న్నారు. మరొకరు పరారయ్యాడు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయిచైతన్య, సీఐ దేవేందర్రెడ్డి, వెంకటాపూర్ ఎస్ఐ ఉన్నారు.