Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కె.పద్మనాభయ్య, డాక్టర్ జీఎన్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ విద్యాసంస్థ గీతం పాలక మండలిలో మరో ఇద్దరు ప్రముఖులు చేరారు. కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ పూర్వ కార్యదర్శి కె.పద్మనాభయ్య, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావును పాలక మండలిలోకి బుధవారం గీతం అధ్యక్షులు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు.విద్య ద్వారా ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న గీతం లక్ష్యాన్ని సాధించడంలో ఆయా రంగాల్లో దశాబ్దాల విశేష అనుభవం గడించిన వీరు తోడ్పడగలరని శ్రీభరత్ అన్నారు.స్వాగత సమావేశంలో గీతం పాలకమండలి సభ్యులతో పాటు గీతం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు, కార్యదర్శి బివి మోహన్ రావు, సహాయ కార్యదర్శి ఎం.భరద్వాజ్, కోశాధికారి బీఎస్ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.