Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలస కార్మికుల సంక్షేమ పాలసీకి తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లను ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని క్యాబినెట్ అభినందించింది. రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లను నెలకొల్పాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది.రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారనీ, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్ బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీనెలా క్రమం తప్పకుండా చెల్లించాలని ఆదేశించింది. ఇందుకోసం వన్టైమ్ సెటిల్మెంట్ వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది. దుమ్ముగూడెం బ్యారేజీకి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్కు నృసింహస్వామి రిజర్వాయర్, తుపాకుల గూడెం బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ క్యాబినెట్ తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయాలని అమ్మేయాలని నిర్ణయించింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలనీ తీర్మానించింది.