Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన నిర్మాణాల్ని అందించడమే లక్ష్యం
- బ్రోచర్ను ఆవిష్కరించిన ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
నిర్మాణ రంగంలో 30 ఏండ్లకు పైగా సుదీర్ఘ అనుభవం గల ఆర్క్ గ్రూప్ తాజాగా వినూత్న నిర్ణయం తీసుకున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడంలో భాగంగా సూర్యాపేటలో ఆర్క్ ముకుంద అనే లగ్జరీ ప్రాజెక్టును బుధవారం ఆ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ప్లాట్లు గల ఈ నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేశా మన్నారు. సూర్యాపేటలోనే తాను పదో తరగతి చదివినట్టు చెప్పారు. 20 ఏండ్ల కింద ఇక్కడి అతి పెద్ద బిల్డింగు అయిన శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం భవనాలను తామే నిర్మించామన్నారు. తాను పెరిగిన ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన ఇండ్లను అందించాలన్న ఉద్దేశంతో ఆర్క్ ముకుందను ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో లభించే నాణ్యమైన ఫ్లాట్లను సూర్యాపేట వాసులకూ అందించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. సంస్థ సీఈఓ గుమ్మి మేఘన మాట్లాడు తూ.. అందుబాటు ధరల్లో లగ్జరీ సదుపాయాల్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణ వాసులకు అందించేందుకు రెండు పడకల గదుల ఫ్లాట్లను డిజైన్ చేశామన్నారు. ఈ ప్రాజ ెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. తాము రెరా అనుమతి తీసుకున్నాకే ఆర్క్ ముకుందను మొదలుపెట్టామని వివరించారు.