Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట
- భువనగిరి మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక సందర్భంగా ఘటన
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రతినిధి
భువనగిరి మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో గెలువడానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కౌన్సిలర్ జిట్టా వేణును టీఆర్ఎస్లో చేర్చుకోవడమే కాకుండా ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యే తన వెంట తీసుకురావడాన్ని తప్పుబట్టారు. పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్, కౌన్సిలర్లు పోత్నక్ ప్రమోద్కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ్మ, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కారుకు అడ్డంగా బైటాయించారు. దాంతో టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వివా దానికి దిగారు. పరస్పరం తోసుకోవడం, నెట్టుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసి ంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ ఈడ్చిపారేశారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయ డంతో ఆ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ ఓటు వేసేందుకు వచ్చినప్పటికీ అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఎన్నికకు దూరంగా ఉన్నాడు. కాగా, మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లకుగాను 34 మంది మాత్రమే కోఆప్షన్ ఎన్నికలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఓటుతో కలిపి 18 ఓట్లు ఉన్న టీఆర్ఎస్ నాలుగు కోఆప్షన్ సభ్యులను గెలుచుకున్నది. ఈ మున్సిపాలిటీలో ఎక్స్ఆఫిషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసుకున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎన్నికకు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీ యాంశమైంది. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలపై ఆసంతృప్తితోనే ఆయన ఈ ఎన్ని కల్లో ఓటు వేసేందుకు హాజరు కాలేదని టీఆర్ఎస్ కార్యకర్తల్లో చర్చ నడుస్తోన్నది.