Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో 2012 మందికి కరోనా సోకింది. ఞర 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు బుధవారం ఉద యం వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ తెలిపింది. వీటితో కలుపుకుని మొత్తం కేసులు 70,958కి చేరుకు న్నాయి. 13 మంది మరణంతో కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 576కు చేరింది.
జీహెచ్ఎంసీలో తగ్గిన కేసులు
గత కొన్ని రోజుల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో కేసు లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 25 శాతం వరకు కేసులు గ్రేటర్లో, మిగిలిన 75 శాతం వరకు ఆయా జిల్లాల్లో ఉం టున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ-532, మేడ్చల్ -మల్కాజ్గిరి -198, రంగారెడ్డి-188, వరంగల్ అర్బన ్-127, ఖమ్మం-97, సంగారెడ్డి-89, నిజామా బాద్-83, కామారెడ్డి-75 ఉన్నాయి. కాగా జనగామ, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు లేక పోగా మంచి ర్యాలలో ఒకటి, నారాయణపేట 4, వికారా బాద్ 6, నిర్మల్ 9 ఉన్నాయి.