Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరుకుపోతున్న కోవిడ్ వేస్ట్...
- పొంచిఉన్న వైరస్ ముప్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు కరోనా వైరస్ విస్తరిస్తున్నా ....దాని నియంత్రణకు సర్కార చురుగ్గా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకోలేకపోవటంతో..వైరస్ ముప్పు పొంచిఉన్నదని భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెస్టులను అందుబాటు లోకి తీసుకురావడానికి నెలల తరబడి జాప్యం చేసిన ప్రభుత్వం, కోవిడ్-19 బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటగా 57 ప్రభుత్వాస్పత్రులు, 94 ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలం దిస్తున్నారు. ఇందులో కొన్ని ఆస్పత్రులు పూర్తిగా కోవిడ్-19 పేషెంట్ల కోసమే ప్రత్యేకించగా, మరికొన్ని ఆస్పత్రుల్లో వీరితో పాటు ఇతర రోగులూ ఉన్నారు. సాధారణ రోజుల్లో ఆస్పత్రుల్లో తయా రయ్యే బయో మెడికల్ వ్యర్థాలను తరలింపు, వాటి నిర్వహణ, ప్రజలకు హాని కలగకుండా నిర్వీర్యం చేసే బాధ్యతలను ఆయా ప్రయివేటు సంస్థలకు అప్పగించారు. అయితే కోవిడ్ రంగ ప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇతర వ్యర్థాలతో పాటు కరోనా రోగులు ఉపయోగించిన వ్యర్థాలను తరలించడం సాధ్యం కాదని ప్రయివేటు సంస్థలు చేతులెత్తెశాయి. ప్రత్యేక రేట్లు నిర్ణయించాలని కోరాయి. కరోనా రోగులు వాడిన మాస్కులు, వైద్యసిబ్బంది ఉపయోగించే పీపీఈ కిట్లు, గ్లౌజులు, ఇతర వస్తువులను తరలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సి ఉంటుందనీ, ఆ పని కోసం జీతాలు కూడా ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పుకొ చ్చాయి. బెడ్ల లెక్కన ప్రత్యేక రేట్లు నిర్ణయించకుండా జాప్యం జరుగుతుండడంతో ఆయా ఆస్పత్రుల్లో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు పేరుకుపోవడంతో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో వ్యర్థాలను వెంటనే అక్క డ్నుంచి తరలించారు. ఈ సమస్య అక్కడితో సమిసిపోలేదు. నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోనూ ఇలాంటి ఇబ్బందులే పునరావతమవుతున్నాయి.
శాశ్వత పరిష్కారం లేదా?
పేరుకు ప్రభుత్వాస్పత్రులు. కాని అక్కడంతా కాంట్రాక్టు పేరుతో ప్రయివేటు సంస్థలపై ఆధారపడే వ్యవహారం. ప్రభుత్వం పాటిస్తున్న ఈ విధానమే పలు సమస్యలకు దారి తీస్తున్నా ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. ప్రభుత్వాస్పత్రుల పారిశుధ్య నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొదట్నుంచి కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రయివేటు ఆస్పత్రులు పెద్దగా చేసేదేమి లేదంటూ వాదిస్తూ వచ్చిన సర్కారు కోవిడ్-19 వ్యర్థాల తరలింపునకు, నిర్వహణకు, నిర్వీర్యానికి ప్రయివేటుపై ఆధారపడితే పెద్ద ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే సొంతంగా నిర్వహించాలనీ, శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని పలువురు మేధావులు, ప్రజాసం ఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.