Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోటార్లు, పైపు లైన్లు తొలగించిన అటవీశాఖ అధికారులు
- అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ- పెద్దవూర
నాగార్జునసాగర్ ఎడమకాల్వ టన్నెల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మం డలంలోని ఎడమకాల్వ టన్నెల నుంచి గిరిజన రైతులు 25ఏండ్ల కిందట వేసుకున్న పైపులైన్లు, మోటార్లను అటవీ అధికారులు బుధవారం తొలగిం చారు. దాన్ని రైతులు కాళావేళ్లాపడి ప్రాధేయపడినా వినకుండా తీసేశారు. వివరాలిలా ఉన్నాయి..
పెద్దవూర మండలం చలకుర్తి రెవెన్యూ పరిది óలోని బెట్టెలతండా సమీపంలో రెవెన్యూ భూములు న్నాయి. అప్పటి హోంశాఖ మంత్రి కుందూరు జానారెడ్డి సర్వే నంబర్ 474, 475, 529, 530, 531, 532లో ఉన్న 50 ఎకరాలకు బెట్టెలతండాకు చెందిన 40 మంది రైతులకు పట్టాలు చేయించి, పాస్ పుస్తకాలు ఇప్పించారు. సాగర్ నిర్మాణ సమ యంలో ఆ రైతుల భూములు ముంపునకు గురికా వడం వల్ల ఈ భూములు ఇచ్చారు. 25ఏండ్ల కిందట ఎడమకాల్వ టన్నల్ వద్ద నుంచి మోటార్లు, పైపులైన్లు వేసుకున్నారు. అయితే, నాట్లు వేసుకునే సమయంలో అకస్మాత్తుగా అధికారులు మోటార్లు తొలగించడంతో రైతులు అడ్డుకున్నారు.
25ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నాం
నాకు ఏకరం భూమి ఉంది. మొత్తం 50 ఎకరాలను మావూర్లోని 40 మంది రైతులకు ఇచ్చారు. వాటిపై హక్కు పత్రాలు, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. 25 ఏండ్లుగా లేనిది ఈరోజు వచ్చి మోటార్లు, పైపు లైన్లను అటవీశాఖ అధికారులు తొలగించారు. ఎంత చెప్పినా, పట్టా పాసు పుస్తకాలు చూపించినా వినలేదు.
బానావత్ శంకర్- బెట్టెలతండా
ఉన్నతాధికారుల ఆదేశానుసారమే..
జిల్లా అటవీశాఖాధికారి శాంతకు మార్ ఆదేశానుసారమే అటవీ భూముల్లో ఉన్న పైపు లైన్లు, మోటార్లను తొలగిం చాం. అటవీ ప్రాంతం కాలువల్లో ఉన్న మోటార్లు, స్టాటర్లు, ఫీజులు, వైర్లు తొలగించాం.
సాగర్ ఎఫ్డీఓ రామేశ్వర రెడ్డి, ఎఫ్ఆర్ఓ సాగర్
నా చేత అధికారులే రూ.25 లక్షలు ఖర్చు పెట్టించారు
గత పుష్కరాల సమయంలో 50 ఎకరాల నా సొంత భూమిలో వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. అప్పటి జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్డీవో దగ్గరుండి నాచేత రూ.25 లక్షలు ఖర్చు పెట్టించి పార్కింగ్ వాటర్ కోసం మోటార్లు, పైపు లైన్లు వేశారు. ఇప్పుడు మోటార్లు, పైపులైన్లు తొలగిస్తున్నారు. పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
శాగం ఈశ్వరమ్మ- తిరుమలగిరి సాగర్