Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక ఆర్టినెన్స్లను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, రైతు సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీి) డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం గ్రామ, మండల, జిల్లా కేంద్రాలన్నిటిలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, పశ్యపద్మ, రాయలచంద్రశేఖర్, అచ్యుతరామారావు, పల్లపు ఉపేందర్రెడ్డి, కన్నెగంటి రవి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులంతా పాల్గొని నిరసనలు జయప్రదం చేయాలని కోరారు.