Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రుఢావత్ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటీషన్పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రెగ్యులర్ పోస్టుల భర్తీ జాప్యంతో ఆస్పత్రుల్లో నర్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నర్సులకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల లభ్యతను పెంచాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, ఆరు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.