Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కల్చరల్ రిపోర్టర్, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు జీఎల్ఎన్ మూర్తి కరోనాతో మృతి చెందారు. ఆయన గోల్కొండ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ కనుమూశారు. ఆంధ్రజ్యోతి, వార్త, ఈనాడు దినపత్రికల్లో ఆయన పని చేశారు. మూర్తి మృతికి పలువురు ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపారు. మూర్తి మరణంపై పౌరహక్కుల సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణరావు సంతాపం తెలిపారు. మూర్తి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జీఎల్ఎన్ మూర్తి కరోనా వైరస్తో మృతి చెందడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.