Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సహకరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు తెలిపారు. ఈమేరకు శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. నదీ జలాల విషయంలో ఏపీకి మద్దతు ఇస్తున్నకారణంగానే, పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. కష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదరని కేసీఆర్ సర్కార్ను ప్రశ్నించారు. సీఎం తీరుతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారతాయని వ్యాఖ్యానించారు. జగన్తో ఒప్పందంలో భాగంగానే అఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారన్నారు. ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నదనీ, ఆగస్టు 12లోపు సీఎం కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా బీజేపీ సహకరిస్తున్నదని చెప్పారు.