Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రయివేట్ రంగాన్ని ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ ఆది వారం జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనకు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఈమేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. 'రాజ్యాంగాన్ని రక్షిం చుకుందాం- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో దేశ వ్యాప్తింగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని సీపీఐ శ్రేణు లకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సులను వెం టనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.