Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన బ్యూరో-హైదరాబాద్
బీజేపీ నూతన కమిటీలో యాదవులకు పార్టీ పదవులు ఇవ్వక పోవడాన్నీ నిరసిస్తూ యాదవ హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగింది. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు యాదవ హక్కుల పోరాట సమితి సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. బీజేపీ యాదవులను విస్మరిం చడం అన్యాయమని ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాములు విమర్శించారు. బీజేపీ కార్యాలయం ముందు దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు