Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన, ఆషా, ఎన్హెచ్ఎం, ఐకేపీ, వీఓఏ తదితర స్కీం వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం. సాయిబాబు, తెలంగాణ అంగన్ వాడి వర్కర్స్ (టీచర్స్), హెల్పర్స్ యూనియన్ నాయకులు పి. జయలక్ష్మి, ఎం. పద్మ, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూ నియన్ నాయకులు ఎస్.రమ, సిహెచ్.ప్రవీణ్కుమార్, తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు భూపాల్, కె.యాదా నా యక్, తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (ఆషా) యూని యన్ నాయకులు కె.సునీత, సి.లలిత ఒక ప్రకటన విడుదల చేశారు.