Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎక్కువ మెట్లు ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను మహిళలు, వద్ధులు వాడేందుకు ఆసక్తి చూపడం లేదని, రోడ్లపై జీబ్రా లైన్స్ వాడే అలవాటు కూడా చాలా మందికి లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జీలకు బదులుగా ఎస్క్లేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది ఉపయోగించుకుంటారని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్ పక్కన ఫుట్ ఓవర్ బ్రిడ్జి కడితే 74 కుటుంబాలు ఉన్న రుహైనా అపార్ట్మెంట్స్లోని వారికి తీవ్ర అసౌకర్యం కలుతుందని, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన రిట్ విచారణ సమయంలో హైకోర్టు పైవిధంగా అభిప్రాయపడింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని, కాబట్టి రిట్పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్క్లేటర్స్, లిఫ్ట్లు వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై జీహెచ్ఎంసీ సానుకూల ధోరణితో ఉండాలన్నారు.
స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్......
ఇందిరాపార్ట్ వద్ద జీహెచ్ఎంసీ స్టీల్ బ్రిడ్జి నిర్మించేందుకు న్యాయపర సమస్యలు పరిష్కారం అయ్యాయి. స్టీల్ బ్రిడ్జి కడితే ఇందిరాపార్క్లోని సింథటిక్ టెన్నిస్ కోర్టుకు నష్టం వస్తుందని డాక్టర్ ఏటీ రాఘవేందర్ సహా 102 మంది గత ఏడాది హైకోర్టులో రిట్ వేశారు. పార్క్లో వాకర్స్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, టెన్నిస్ కోర్టుకు సమీపంలోనే మరో టెన్నిస్ కోర్టును 5 నెలల్లో నిర్మాణం చేస్తామనీ, ఇందుకు పిటిషనర్లు కూడా అంగీకరించారని జీహెచ్ఎంసీ హైకోర్టు దష్టికి తెచ్చింది. ప్రైయివేటు స్థల సేకరణ చేస్తే భారీ చెల్లింపులు అవసరమని, ఈ కారణంగా జీహెచ్ఎంసీకే చెందిన ఇందిరాపార్క్ స్థలంలోనే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి వీలుగా గతంలోని మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని కోరింది. దీంతో రిట్పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించిన జస్టిస్ చల్లా కోదండరామ్.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డం వచ్చే వక్షాలను మరో చోట పాతిపెట్టాలని జీహెచ్ఎంసీకి ఉత్తర్వులు జారీ చేసింది.