Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో 2256 మందికి కరోనా సోకింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల మధ్య 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం ఉదయం వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ తెలిపింది. వీటితో కలుపుకుని మొత్తం కేసులు 77,513కి చేరు కున్నాయి. 14 మంది మరణంతో కోవిడ్-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 615కు చేరింది. రోగుల్లో ఇప్పటి వరకు 54,330మంది కోలుకోగా 22, 568 మంది చికిత్స పొందుతున్నారు. 1596 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి.
జీహెచ్ఎంసీలో తగ్గిన కేసులు :గత కొన్ని రోజుల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా నమో దవుతున్న కేసుల్లో 25 శాతం వరకు కేసులు గ్రేటర్లో, మిగిలిన 75 శాతం వరకు ఆయా జిల్లాల్లో ఉంటున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ-464, వరంగల్ అర్బన్ 187, రంగారెడ్డి 181, మేడ్చల్ మల్కాజ్గిరి 138, కరీం నగర్ 101 ఉన్నాయి. కాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నారాయణపేట్లో తొమ్మిది కేసులు ఉన్నాయి.