Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కజొన్నను ధ్వంసం
చేసిన అధికారులు
నవతెలంగాణ- బీర్కూర్
చేతికొచ్చిన మొక్కజొన్న పంటను అటవీశా ఖాధికారులు ట్రాక్ట ర్లతో ధ్వంసం చేశారు. దీంతో గిరిజ నులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు న్నాయని చూపి నా పట్టించు కోలేదని, కాళ్ల మీద పడినా కనికరిం చలేదని రైతులు వాపోయారు. వివ రాలిలా ఉన్నాయి.. కామా రెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని చత్రునాయక్ తండాలో సుమారు 20 ఏండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అధికారులు వచ్చి ట్రాక్టర్లతో మొత్తం ధ్వంసం చేశారని గిరిజనులు వాపోయారు. సాగు చేసే ముందు ఏమీ చెప్పకుండా ఇప్పుడు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు 20 వేల పెట్టుబడి నష్టపో యామన్నారు. 25ఎకరాల్లో పంటను నేలమట్టం చేశారన్నారు.
గిరిజనుల పంట ధ్వంసం చేస్తారా?
తెలంగాణ రైతు, గిరిజన సంఘం
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట తండాలో గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారా? అని తెలంగాణ రైతు సంఘం ప్రశ్నించింది. అమాయక గిరిజ నుల నోటికాడి ముద్దను లాగేందుకు ప్రయ త్నిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు పి జంగారెడ్డి, టి సాగర్,తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మానాయక్ ఆర్.శ్రీరాంనాయక్,వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. హరితహారం పేరుతో గిరిజనుల నుంచి పోడు భూ ములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ అధికా రులు, పోలీ సులు దాడులు చేశారని తెలిపారు. అమా యకు లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపు తున్నారని విమర్శించారు. మహిళలపై భౌతికదాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.