Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సున్నం రాజయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. హైదరాబాద్లోని కార్మికసంఘం రాష్ట్ర కార్యాల యంలో సున్నం రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సున్నం రాజయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై భద్రాచలం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, రైతులు, వివిధ తరగతుల ప్రజల పక్షాన వారి సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన నేత అని కొనియాడారు. ఆటోలు, బస్సుల్లో అసెంబ్లీకి వెళ్తూ, సాధారణ జీవితాన్ని గడిపారని అన్నారు. 1999లో తొలిసారిగా భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సీపీఐ(ఎం) పక్షాన ఉప శాసనసభాపక్ష నాయకుడిగా పని చేశారని గుర్తు చేశారు. 2004, 2014లో ఇదే స్థానం నుంచి గెలుపొందారని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ శాసన సభా పక్ష నేతగా ఉంటూ టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిశితంగా విమర్శించారన్నారు. ఎస్ఎల్బీసీ పెండింగ్ పనుల పూర్తి కోసం, ఎడమ కాలువపై ఉన్న లిఫ్టులకు మరమ్మతులు చేయాలని శాసనసభలో ప్రభు త్వాన్ని కోరారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన సున్నం రాజయ్య సర్పంచ్గా జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే అయ్యారన్నారు. గిరిజనుల హక్కులు, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారని చెప్పారు. నీతి, నిజాయితీగా ఉంటూ అతి సాధారణ వ్యక్తిలా తన జీవితాన్ని గడిపారన్నారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొని నిరాహార దీక్ష చేశారని తెలిపారు. రాష్ట్ర విభజన సంద ర్భంగా ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని అనేక ఉద్యమాలు సున్నం రాజయ్య నిర్వహించారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శోభన్, ఆర్ రాహుల్ పాల్గొన్నారు.