Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు
- మేక్ ఇన్ ఇండియాతో సమస్యలు తెచ్చుకున్నాం..
న్యూఢిల్లీ: 'స్పష్టమైన, సమర్థవంతమైన పారిశ్రామిక విధానం ఇప్పుడు భారత్కు అవసరం. సామాజిక వ్యవస్థలు బలహీనంగా ఉంటే ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని తీసుకురాలేం. కాబట్టి మార్కెట్లో పెట్టుబడులు, వృద్ధికి సామాజికఇప్పుడు కావాల్సింది.. చక్కటి పారిశ్రామిక విధానం... వ్యవస్థలు కూడా కీలక ప్రభావం చూపుతాయి. 'మేక్ ఇన్ ఇండియా' వంటి విధానాలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేయవు' అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు అన్నారు. 'ద పాండమిక్, ఛేంజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ : ఇండియాస్ బిగ్ అపార్చునిటీ, బిగ్ రిస్క్' అనే అంశంపై ప్రసంగిస్తూ బసు కీలకప్రతిపాదనలు చేశారు. ఇందులో ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రభుత్వ నిర్ణయాలు కారణం
2011-12 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. ప్రజల పొదుపు, పెట్బుడులు క్రమంగా క్షీణించాయి. 2016తర్వాత ఇది మరింత పెరిగింది. దీనికి కారణం ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలు. సమాజంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, అపనమ్మకం కూడా ఒక కారణమే.
మేక్ ఇన్ ఇండియాతో..ఇక్కట్లే
'క్లోజ్డ్ ఎకానమీ' ముఖ్యసూత్రంగా 'మేక్ ఇన్ ఇండియా'ను తీసుకొచ్చారు. అర్జెంటీనా, మరికొన్ని దేశాలు ఇలాగే గతంలో చేశాయి. దెబ్బతిన్నాయి. 'మేక్ ఇన్ ఇండియా' వల్ల మనకూ అవే ఫలితాలు వస్తాయి. 1990, 2000లలో ఐటీ విప్లవం, ఫార్మా, ఆరోగ్య సేవలు, ఇతర సేవలు మనదేశాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఆర్థిక వ్యవస్థకు బలంగా మారిన వీటిపై దృష్టిసారించాలి. క్లోజ్డ్ ఎకానమీ కాకుండా 'ఓపెన్ ఎకానమీ' విధానాల్ని కొనసాగించాలి. విద్యావ్యవస్థను మెరుగుపర్చుకోవాలి. ఆరోగ్య సేవల్లో, పరిశోధనల్లో నిధుల వ్యయం జరగాలి. మతపరంగా, సామాజికంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి జరగాలి.