Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహావిష్కరణ సభలో ఎంపీ కేశవరావు,
మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మొయినాబాద్
దేశంలో ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తొలకట్ట గేట్ సమీపంలో ఉన్న భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఔషధ వనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ తేజోమూర్తి, తెలుగువారి విజ్ఞానదీప్తి, యావత్ భారతావని గర్వించదగ్గ గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పీవీ విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన కిర్తీని యావత్తు ప్రపంచానికి తెలిసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మెన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తొలకట్ట సర్పంచ్ శ్రీనివాస్, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్ పాల్గొన్నారు.