Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో జులై 29న ఆయన నిమ్స్లో చేరారు. దీంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. 11 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆయన శనివారం ఉదయం 10.30 గంటలకు మృతి చెందారు. లోక్సభ ఎంపీగా ఆరుసార్లు గెలుపొ ందారు. రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. సిద్దిపేట లోక్సభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. 1942 జూలై 1న హైదరాబాద్లోని బోలక్పూర్లో ఆయన జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న ఆయన.. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా నాయ కుడిగా, ప్రజాప్రతినిధిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ ఉపాధ్య క్షులుగా కొనసాగుతున్నారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సాను భూతి తెలిపారు. ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా,సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్, ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీలు హనుమంతరావు, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, అధికార ప్రతినిధి కృష్ణతేజ, బొల్లు కిషన్, నిరంజన్ తదితరులు సంతాపం తెలిపారు. గాంధీభవన్లో పార్టీ జెండాను అవనతం చేశారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎల్లయ్య మృతికి కేసీఆర్ సంతాపం :మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మతికి ముఖ్య మంత్రి కె చంద్రశేఖ రరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగర్క ర్నూల్ నుంచి ఎంపీగా ప్రాతి నిధ్యం వహించిన ఆయన...రాజకీయనేతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస యాదవ్ ఎల్లయ్య మృతికి సంతాపాన్ని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణంపట్ల శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన రాజకీయ విలువలకు, తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారని పేర్కొన్నారు. ఎల్లయ్య మరణంతో మంచి స్నేహితుణ్ని కోల్పోయామని వేర్వేరుగా విడుదల చేసిన సంతాప సందేశాల్లో గుత్తా, కేకే ఆవేదన వ్యక్తం చేశారు.