Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహమ్మారి కట్టడిలో సర్కారు విఫలం : వామపక్షాలు, రాజకీయ
పార్టీల నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వేదిక డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్లోని ముగ్దుం భవన్ లో వేదిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబందనల ప్రకారం రాష్ట్రంలో తగినన్ని పరీక్షలు నిర్వహించడం లేదని విమర్శిం చారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని ప్రతి పక్షాలు, కోర్టులు మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకోడం లేదని అన్నారు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సిం హారావు మాట్లాడుతూ కరోనా కట్టడిలో సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రయివేటు అస్ప త్రుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య అత్య యిక పరిస్థితి ప్రకటించి, ప్రయివేటు ఆస్పత్రులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కరాళ నృత్యం చేస్తుంటే తనకేమి పట్టనట్టూ ముఖ్యమంత్రి ఫాం హౌజ్కు పరమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక నోడల్ కమిటీని ఏర్పాటు చేసి కరోనా వైద్య సేవలను అందరికి ఉచితంగా అం దించాలని కోరారు. తెలంగాణ జనసమితీ అధ్యక్షు లు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత ఐదు నెలలుగా ఉపాది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు నవంబర్ వరకు ప్రతి నేలా రూ. 7,500 నగదు, ఉచిత రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజల ప్రాణాలను కాపాడు.. వారి బతుకులను నిలబెట్టు' అనే నినాదంతో తాము చేపట్టిని ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్టు ప్రకటించారు. ప్రభు త్వం దిగి రాకుంటే ఊరు, వాడా నల్ల జెండాలతో నిరసన కార్యమ్రాలను ఉధృతం చేయనున్నట్టు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ తాము ప్రజల గొంతుకను వినిపించేందుకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా దెబ్బకు ఉపాది కోల్పోయి లక్షలాది మంది చేనేత కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటికే ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమో క్రసీ నాయకులు గోవర్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కరోనా బాదితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రయివేట్ దోపిడీ: సీపీఐఎంఎల్(న్యూడెమోక్రసీ)
కరోనా పేరుతో రాష్ట్రంలోని ప్రయివేటు ఆస్ప త్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల చేస్తున్న అక్రమ ఫీజుల దోపిడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉచితంగా కరోనా చికిత్స చేయాలి: పీడీఎస్యూ
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, బోయిన్పల్లి రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైద్యం పేరుతో ప్రయివేటు ఆస్పత్రులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని కోరారు.