Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ వెబినార్లో శాస్త్రవేత్త డాక్టర్ వెంగయ్య
- ఏడాదిపాటు నీరా అందుబాటులో ఉండేలా చర్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాటిచెట్టు ద్వారా 200 రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చని తమ పరిశీలనలో తేలిందని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టు డాక్టర్ వెంగయ్య తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేస్థాయిలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. శనివారం హైదరాబాద్లో కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) ఆధ్వర్యంలో 'కల్లుగీతవృత్తి- ఆధునీకరణ-ఉపాధి అవకాశాలు' అనే అంశంపై వెబ్నార్ జరిగింది. దీనికి సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వెంగయ్య మాట్లాడుతూ నీరాకు ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు. నీరా కోసం ప్రతి మూడు గంటలకు ఒకసారి గెల గీయాలనీ, ఇది కార్మికులకు కష్టసాధ్యమనీ, అందుకు శాస్త్రీయైన పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. నీరాలో 12 నుంచి 14 వరకు చక్కర శాతం ఉండటంతో కొబ్బరినీళ్ల కంటే తియ్యంగా ఉంటుందనీ, గాలితాగడం వల్ల అది ఆల్కాహాల్గా మారుతుందని చెప్పారు. 100 నుంచి లీటర్ల నీరాతో పది కేజీల బెల్లం తయారు అవుతుందన్నారు. తాటి బెల్లానికి ఆదరణ పెరిగిందనీ, ఆ బెల్లం నుంచి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వీట్లు, డ్రింక్, పండిపదార్ధాలు తయారు చేయడం ప్రారంభమైందన్నారు. వీటన్నింటితో వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, కోట్లాది రూపాయలు ఆదాయరూపంలో దేశానికి ఇవ్వవచ్చనన్నారు. తాటి ఉత్పత్తులు ఆయిర్వేద మందుల్లో తాటిబెల్లాన్ని విరివిగా ఉయోగిస్తున్నారన్నారు. గుండెజబ్బులు, దీర్ఘాకాలిక వ్యాధులకు, కాన్సర్ వంటి రోగాలను నియంత్రణలో ఉంచుతుందన్నారు. తాటిగడ్డల ద్వారా బిస్కెట్లు, రవ్వ, లడ్లు, తాటిపండురసం ద్వారా డ్రింక్లను తయారు చేయవచ్చన్నారు. తాటి హైబ్రీడ్ మొక్కలపై పరిశీధనలు జరగడం లేదన్నారు. బీహార్లో పొట్టి తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. తాటిపీచు,తాటిఆకుల నుంచి అల్లికలు తయారు చేసి ఉపాధి పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మద్దెల రమేష్గౌడ్, మాటూరి బాల్రాజు, అయిలివెంకన్న జయరామ్ తదితరులు అభిప్రాయాలు పంచుకున్నారు.