Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలను కోరిన మెడికల్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే చికిత్స చేస్తూ దాని బారిన పడి మరణిస్తున్న వారిని ఆదుకునేందుకు ఒక విధానం రూపొందించాలని మెడికల్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ బి.వెంకటేశ్వర్రెడ్డి, కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్లతో కూడిన ప్రతినిధి బందం వినతిపత్రం సమర్పించారు. కోవిడ్-19 బారిన పడి మరణించిన పర్ణశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేశ్ భార్యకు గ్రూప్ వన్ పోస్టుఇవ్వాలని, అలాగే వారియర్ కుటుంబానికి రూ.ఒక కోటి పరిహారం ఇవ్వాలని కోరారు.