Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ స్కీం వర్కర్ల సమ్మె
- తహసీల్దార్లకు వినతులు
- కరీంనగర్లో ఆశా యూనియన్ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ- విలేకరులు
ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న స్కీం వర్కర్లు శనివారం రెండో రోజు కూడా కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించారు. పాల్వంచ, ఇల్లందు, చండ్రుగొండ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పాల్గొన్నారు.కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో ముందస్తుగానే ఆశా కార్యకర్తల యూనియన్ నాయ కురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్ ఖండించారు. జగిత్యాలలో కలెక్టరేట్ గేట్ ఎదుట సీఐటీయూ అనుబంధ రంగాల స్కీం వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. అనంతరం ఏవో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా కార్యదర్శి తిరుపతినాయక్ మాట్లాడారు. స్కీం వర్కర ్లను కార్మికులుగా గుర్తించాలని, 45, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫా రసులు వెంటనే అమలు చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని దక్షిణ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తం గా ధర్నాలు జరిగాయి.వనపర్తి జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆశాలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, అనంతరం డీటీకి వినతిపత్రం అందజేశారు. మహబూ బ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో సీఐటయూ జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పీహెచ్సీ ముందు ధర్నా చేశారు. వైద్యురాలు షబానా బేగానికి వినతిపత్రం అందజేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని కాప్రా మండల ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు.
కార్మికులకు సీఐటీయూ అభినందనలు :15 డిమాండ్ల పరిష్కారానికై రెండు రోజుల పాటు జరిగిన స్కీమ్ వర్కర్స్ అఖిల భారత సమ్మె సక్సెస్ అయింది. కరోనా విధుల్లో ఉన్న వేలాది మంది స్కీమ్ వర్కర్స్ ముఖ్యంగా ఆశా, అంగన్వాడీ కార్మికులు ప్రభుత్వాలను ధిక్కరించి వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. రెండు రోజుల అఖిల భారత సమ్మె విజయవంతం అయినందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ వర్కర్లను సీఐటియూ అభినందించింది. వివిధ కేంద్ర పథకాల కింద పనిచేస్తున్న వేలాది మంది స్కీమ్ కార్మికులు ఎన్హెచ్ఎం, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఎస్ఎస్ఎ ప్రాథమిక సేవలను అందిస్తూ వెళ్లారు. అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజా బ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సమ్మె జరిగింది. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఆశా, అంగన్వాడీ కార్మికులు బ్లాక్ బ్యాడ్జ్లు ధరించి విధుల్లో చేరారు. అధికారుల బెదిరింపులు ఒకవైపు, మరోవైపు పోలీసుల అరెస్టులు జరిగినప్పటికీ స్కీం వర్కర్లు ఎక్కువగా మహిళలు ముఖ్యంగా అంగన్వాడీ, ఆశా కార్మికులు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ పిలుపుకు అన్ని రంగాల కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. అనేక చోట్ల ఈ కార్మికుల సేవల ప్రాము ఖ్యతను గుర్తించి, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ధర్నాలు, ప్రదర్శనల్లో భాగస్వామ్యం అయ్యారు. చాలా రాష్ట్రాల్లో మొదటి రోజు కార్మికులు ప్రదర్శనలు నిర్వహించి, బ్లాక్ స్థాయిలో అధికారులకు మెమోరాండం ఇచ్చారు. రెండో రోజు గ్రామ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా డ్యూటీ చేస్తూ ఆశా, అంగన్వాడీ కార్మికులు మరణించారని, కాని ఎటువంటి పరిహారం అందలేదని సంఘం జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధూ పేర్కొన్నారు.కరోనా పోరులో ముందు వరుస (ఫ్రంట్లైన్)లో ఉన్న స్కీమ్ వర్కర్స్కు అవసరమైన భద్రతా చర్యలు, రిస్క్ అలవెన్స్ను ప్రభుత్వం వెంటనే అందించాలని, ప్రాథమిక సేవల పథకాలకు కేటాయింపులను పెంచాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని ఆమె పేర్కొన్నారు. స్కీం వర్కర్స్ నేడు జరగబోయే దేశవ్యాప్తంగా జైలు భరో, సత్యాగ్రహ ఆందోళనల్లో భాగస్వామ్యం కానున్నట్లు ఆమె తెలిపారు.