Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగపుత్రుల ఆవేదన
నవతెలంగాణ- ఆర్మూర్టౌన్
తమపై వీడీసీ విధించిన గ్రామ బహిష్కరణ ఎత్తివేయలేదని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం గంగపుత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తమతో ఎవరూ సంప్రదించకుండా.. కేవలం అధికారులకు సాక్ష్యం చూపించడం కోసమే బహిష్కరణ ఎత్తేసినట్టు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా కఠినమైన ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. గంగపుత్రులు వేరే కులస్థులతో మాట్లాడినా రూ.1500 జరిమానా విధించారని, మాకు ఇప్పటికీ ఎటువంటి సహాయం అందడం లేదని వాపోయారు. నిత్యావసర వస్తువులు సైతం దొరకడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు రాజేందర్ బెస్త, కార్యదర్శి సాయిప్రసాద్ బెస్త, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.