Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడ్డ 442 మంది జర్నలిస్టులకు రూ. 80 లక్షల ఆర్థిక సహాయం అందించినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్వారంటైన్లో ఉన్న 358 మంది జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున రూ. 71.50 లక్షలు, హోం క్వారంటైన్ లో ఉన్న 84 మంది జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున రూ. 8.40 లక్షలు జర్నలిస్టుల నేరుగా ఎకౌంట్లో జమ చేసినట్టు తెలిపారు.
కరోనా బారిన పడి క్వారంటైన్ అయిన జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ వాట్సప్ నెంబర్ 8096677444 కి పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.