Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమి(నీసా) డైరెక్టర్గా అదనపు డీజీ సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆనంద్ నీసాలోనే ఐజీగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు నీసా డైరెక్టర్గా ఉన్న అంజనా సిన్హా యూపీకి బదిలీ చేశారు. తెలంగాణ రాష్ట్ర కేడర్కు చెందిన ఆనంద్ గతంలో సైబరాబాద్ కమిషనర్గా, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా, సీఐడీ డీఐజీగా పలు విభాగాలలో పని చేశారు. సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆనంద్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిషనర్గా కూడా తన సేవలు అందించారు. అనంతరం ఆయన అదనపు డీజీగా పదోన్నతి పొందాక కేంద్ర సర్వీసులకు వెళ్లారు.