Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విజయవాడలో కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల (హౌటళ్లు) భద్రతపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. గతేడాది అక్టోబర్ 21న హైద రాబాద్లోని చిన్న పిల్లల ఆస్పత్రి షైన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యం లో ఆస్పత్రుల భద్ర తపై పెద్ద ఎత్తున విమర్శలు, సందేహాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో వరం గల్లో రోహిణి ఆస్పత్రిలోనూ జరిగింది. దీంతో అప్పట ికప్పుడు హడావుడి చేసిన అధికా రులు, వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆస్పత్రులకు నోటీ సులు ఇవ్వగా, ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లా ల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తు న్నాయని గుర్తించి 2000 వరకు ఆస్పత్రు లకు నోటీ సులు ఇచ్చి ంది. జిల్లాల్లోనూ దాదాపు అంతే సంఖ్యలో నోట ీసులిచ్చి చేతులు దులుపు కున్నారు. ఒక్క హైదరా బాద్ నగరంలోనే 1721 ఆస్పత్రులు నడు పుకు నేం దుకు లైసెన్సులుపొందగా, అందు లో 90 శాతం వర కు నిబంధనలను ఉల్లం ఘించినట్టు సమాచారం. జాగ్రత్తలు తీసుకోకుండా అగ్నిమాపక శాఖ మార్గద ర్శకాలను తుంగలో తొక్కినట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా చికిత్సను 56 ప్రభుత్వాస్పత్రులు, 91 ప్రయివేటు ఆస్పత్రులు, కార్పొరేటు ఆస్పత్రుల ఆధ్వ ర్యంలో 36 కోవిడ్ కేర్ సెంటర్లు (హౌటళ్లు) చికిత్స అందిస్తున్న విషయం విదితమే. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడీ చేయడం, ఆతర్వాత మొక్కుబడి చర్యలతో సరిపెట్టు కోవడం పరిపాటిగా మారింది.మరో సారి ఇదే రకమైన హడావిడికి అధి కారులు తెర లేపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయ వాడలో జరిగిన సంఘటనతో నిబంధనలు ఉల్లం ఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే, ప్రయిy టు ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ముందు కనీసం ప్రభుత్వా స్పత్రుల్లో భద్రతా పాటించాలని, అధికా రులు ఏదో చేశామన్నట్టు కాకుండా కఠినం గా వ్యవహ రించాలని పలువురు కోరుతు న్నారు. ఇదిలా వుండగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల పై వైద్య ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.