Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యాశాఖలోని పలు సమస్యలను పరిష్కరిం చాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. 'ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రా క్టు అధ్యాపకులు, మినిమం టైం స్కేలు అధ్యాపకుల సర్వీసులను రెన్యూవల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను రెన్యూవల్ చేస్తూ ఉత్తర్వులివ్వాలి, పాఠశాల విద్యలో మండల విద్యాధికా ులకున్న అధికారాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులకు బదిలీ చేయాలి, జిల్లా విద్యా శాఖాధి కార్యాల యాల్లో సమగ్ర శిక్ష పథ కం కోసం సృష్టిం చిన సెక్టో రల్ అధికా రుల పోస్టుల్లో నవం బరు-2019లో నిర్వహించిన పరీక్షల ద్వారా ఎంపికైన వారిని నియమించాలి...' అని నర్సిరెడ్డి కోరారు. వీటితోపాటు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రా క్టు అధ్యాపకులకు స్థానచలనాన్ని కలిగించాలని, ప్రభుత్వ మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సం బంధించిన అంతర్ జిల్లా బదిలీలను చేపట్టాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యా యులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జూని యర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను కోవిడ్ వల్ల ఏప్రిల్లో తొలగించారని పేర్కొన్నారు. వీరికి ఇతర ఉపాధి అవకాశాల్లేవని తెలిపారు. కళాశాలలు ప్రారంభిం చకపోవటం వల్ల తిరిగి నియ మాకాలు చేపట్టలేదని వివరించారు. తక్షణమే 2020-21 విద్యా సంవ త్సరానికి వీరందరి నియా మకాలను చేపట్టి.. పారితో షికం చెల్లించాలని కోరారు. మోడల్ స్కూళ్లు, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో తాత్కాలికంగా గంటల ప్రాతిపదిక (అవర్లీ బేస్డ్) నియమితులయ్యే ఉపాధ్యా యులు, పార్ట్ టైం టీచర్లు, విద్యా వాలంటీర్లను కూడా ఏప్ర ల్లో తొలగించారని పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి వీరందరి నియామకాలను చేప ట్టాలనీ, పారితోషికం చెల్లించాలని నర్సిరెడ్డి కోరారు.