Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్సీ డైరెక్టర్ సాయన్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించి చూపించిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని స్టేట్ రీసోర్స్ డైరెక్టర్ (ఎస్ఆర్సీ) సాయన్న అన్నారు. 'సర్వాయి పాపన్న జీవిత చరిత్ర మీడియా పాత్ర' అనే అంశంపై కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం వెబినార్ నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాయన్న ముఖ్య వక్తగా ప్రసం గించారు. 'సామాన్య కల్లుగీత కార్మికుని నుంచి చక్రవర్తి వరకు ఎదిగిన సాయన్న చివరి వరకు బడుగు బలహీన వర్గాల కోసం తపించారు. అనాడున్న సామాజిక పరిస్థి తులకు ఎదురొడ్డి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసి చూపించారు' అని అన్నారు. 'చరిత్రలో అణగారిన వర్గాలకు చెందిన ఎందరో పోరాట యోధులు తమ వారి కోసం ముందుండి పోరాడినప్పటికీ వారి చరిత్రను గంథస్థం చేయక పోవడం వల్ల భవిష్యత్ తరాలకు తెలియకుండా పోయిందనీ, చత్రపతి శివాజీకి సమకాలీకునిగా అదే పం థాలో సర్వాయి పాపన్న వీరోచితంగా పోరాడినా ఆయనను గుర్తించలేదు. వందల ఏండ్లుగా మరుగున పడి పోయిన ఆయన వీరత్వాన్ని పోరాట పటిమను నేటి తరానికి అందిం చేందుకు అన్ని సామాజిక మాధ్యమాలను అంది పుచ్చుకుని జన సామాన్యునికి అందించేందుకు కృషి చేయాలి' అని అన్నారు. ఈ కార్యమ్రంలో డిల్లీ విశ్వవి ద్యాలయం ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి, పరిశోధకులు కట్టగాని రవీందర్, రచయిత వీరగోని పెంటయ్య పాల్గొన్నారు.