Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. సోమవారం హైదరాబాద్లోని మౌలాలి ఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో రైల్వే మహిళా రక్షక దళం (9ఏబ్యాచ్) సబ్ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. రైల్వే ఆస్తులు, ప్రయాణ ికులను కాపాడటంలో ఎప్పుడు ముందుండాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే మొదటి సారీగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణలో అన్ని జోన్ల నుంచి 83 మంది సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్యాడెట్లకు పతకాలు, యోగ్యతా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రం డైరెక్టర్ సంజత్ సాంకృత్యాయన్, ముఖ్య భద్రతా కమిషనర్ జిఎం. ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.