Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూఎం అండ్ హెచ్ఈ డిమాండ్
- డీహెచ్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - సిటీబ్యూరో
ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్-ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగు లు, హెచ్డీసీ కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం హైదరాబా ద్లోని ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ కార్యా లయం ఎదుట తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. హెచ్డీసీ కార్మికులకు 2019 మార్చి నుంచి 2020 మే వరకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020మే నుంచి తొలగించిన హెచ్డీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినదించారు. 2020 మే నుంచి వచ్చిన కొత్త కాంట్రాక్టు ఏజెన్సీలు హెచ్డీసీ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు జె.కుమార స్వామి, ఐఎంఎస్ఈ కమిటీ కోశాధికారి రాఘవేంద్ర, కార్మికులు సుశీల, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.