Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం: బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.85 కోట్ల రూపాయలకు పెంచి కేసీఆర్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. కరోనా కట్టడిలో ప్రధాని మోడీ సమర్థవంతంగా పనిచేస్తుంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిసు ్తన్నదని విమర్శించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల బీజేపీ కార్యాలయాలకు ఆయన సోమవారం ఢిల్లీ నుంచి ఆన్లైన్లో భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లైబ్రరీ, పరిశోధన, సమావేశాలకు వసతులుండేలా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఉండాలని సూచించారు. 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించారని కొనియాడారు. మోడీ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించేందుకు 'ఆయుష్మాన్ భారత్' ప్రవేశపెడితే కేసీఆర్ సర్కార్ మాత్రం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ మాట్లాడుతూ ఎంఐఎం కార్యాలయం సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా మారిందనీ, టీఆర్ఎస్ కార్యాలయం కల్వకుంట్ల ఆస్తిగా మిగిలిపోనున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ అధ్యక్షులు కె.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.