Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్(ఎస్ఆర్డీపీ) రెండో ప్యాకేజీలో భాగంగా రూ.26.45కోట్లతో నిర్మించిన హైదరాబాద్లోని బైరామల్గూడ కుడివైపు ఫ్లైఓవర్ను పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ్మోహన్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ రుమాండ్ల శ్రీధర్, ఎస్ఆర్డీపీ ఎస్ఈ రవీందర్రాజ్ తదితరులు పాల్గొన్నారు.