Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ కార్యదర్శుల నిరసన
- అధికారులకు వినతులు
నవతెలంగాణ-విలేకరులు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పనుల బాధ్యత తమకొద్దంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీ పనులతోనే సమయం ఉండటం లేదని, ఉపాధి పనుల వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం అధికారులకు వినతిపత్రాలు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఎంపీడీవో నారాయణకు మెమోరాండం అందించారు. గుండాలలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్పై పంచాయతీ కార్యదర్శులకు జరిగిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం అనంతరం తమకు అదనపు బాధ్యతల నుంచి మినహాయింపు కోరుతూ ఎంపీడీఓ వెంకట్రావు, ఎంపీఓ వలీ, ఏపీఓ రఘునాథ్కు, శిక్షణ ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శులు గ్రామీణ ఉపాధి హామీ చట్టం అదనపు బాధ్యతల నుంచి తమను తప్పించాలని డిమాండ్ చేశారు.ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ మండలాల ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ పనులతోనే సరిపోతుందని, ఇక ఉపాధి హామీ పనుల అదనపు బాధ్యత వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు తమకు అప్పగించొద్దంటూ రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలకేంద్రంలో ఎంపీడీఓ వసంత లక్ష్మికి పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. తనపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.