Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త వివాహేతర సంబంధమే కారణం..!
నవతెలంగాణ - గండీడ్
డిప్యూటీ రేంజ్ అధికారిణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని మహమ్మదాబాద్లోని అటవీ కార్యాలయంలో బుధవారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపూర్ మండల కేంద్రానికి చెందిన వహిదా బేగం(33) నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన భాను ప్రకాష్ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప ఉంది. వహిదా మహమ్మదాబాద్ అటవీ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా విధులు నిర్వహించేవారు. భర్త జిల్లా అటవీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెం ట్గా పని చేస్తున్నారు. అయితే, భర్త డిగ్రీ చదివే అమ్మాయితో వివాహే తర సంబంధం ఏర్పరచుకున్నారు. అంతేగాక, ఆ అమ్మాయిని పెండ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తానని భార్యతో చెప్పడంతో తగాదా జరిగింది. దీంతో మానసికంగా కుంగిపోయిన వహిదా కార్యాలయంలోనే పురుగుల మంది తాగారు. గమనించిన సహౌద్యోగులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి అక్కడ మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు.