Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళిసై ఆవేదన
- ఉపాధి కల్పించటంలో పరిశ్రమలదే కీలక పాత్రంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొందరు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కూడా కోవిడ్ నిబంధనలను పాటించకపోవటం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోవడం, శుభ్రత పాటించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని నివారించవచ్చని ఆమె చెప్పారు. కరోనా వల్ల సంభవించిన నష్టాలను పూడ్చటంతోపాటు ప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని వాణిజ్య, పరిశ్రమల అధిపతులకు సూచించారు. ఈ రెండు రంగాలు పునరుత్తేజం పొందటం ద్వారా లక్షలాది మంది ఉపాధి వ్యవస్థలను కాపాడుతున్నాయని ఆమె అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్రస్టీ (ఫిక్కీ) ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన సదస్సులో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 'కోవిడ్ నష్ట నివారణలో ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలు' అనే అంశంపై ఆమె ప్రసంగించారు. గతంలో పీపీఈ కిట్లు, మాస్కుల కొరతను ఎదుర్కొన్న దేశం ఇప్పుడు ప్రభుత్వాల సమర్థ చర్యలు, మద్దతుతో రోజుకు ఐదు లక్షల పీపీఈ కిట్స్ , మూడున్నర లక్షల మాస్కుల తయారీ సామర్ధ్యాన్ని సాధించిందని అన్నారు. వెంటిలేటర్లు, టెస్టింగ్, పీపీఈ కిట్లతోపాటు ప్రాణాధార ఔషధాలను మనం ఇప్పుడు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.