Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు 3000 టెస్టులకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్కు మరో వారం రోజుల్లో కోబాస్ 8800 యంత్రం రానున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన కంపెనీకి రూ.ఏడు కోట్ల ఇందుకోసం చెల్లించింది. పరీక్షలను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు కనీసం 40 వేల టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికీ రోజుకు 20 వేల వరకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండగా ఇందులోనూ యాంటీజెన్ పరీక్షలే ఎక్కువగా ఉంటున్నాయి. ఒకసారి యాంటీజెన్ పరీక్షలు చేసుకున్నాక నెగెటివ్ వచ్చి, వైరస్ లక్షణాలుంటే తిరిగి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాల్సి వస్తున్నది. ఇందుకోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలను కూడా గణనీయంగా పెంచేందుకు సర్కారు భావిస్తున్నది. గతంలో జపాన్కు చెందిన రొషె కంపెనీకి చెందిన మిషన్ ఒకటి నిమ్స్ కోసం కేటాయించినప్పటికీ, ఐసీఎంఆర్ ఆదేశాలతో చెన్నై నుంచి కోలకతాకు కేంద్ర ప్రభుత్వం పంపింది.