Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగం బలోపేతం కోసం నిధులు కేటాయించాలి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ - నల్లగొండ కలెక్టరేట్
నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న లోపాలను సవరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నల్లగొండ పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యావిధానంలో కొన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షించాలని, సవరణ కోరుతూ ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు జీడీపీలో బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి బి.బిక్షపతి మాట్లాడుతూ.. ప్రయివేటు ఉపాధ్యాయులకు సహాయం చేయడం గర్వించదగ్గ విషమన్నారు. ప్రయివేటు యాజమాన్యాల నుంచి ఉపాధ్యాయులకు రావాల్సిన వేతనాలు ఇప్పించామని తెలిపారు. అంతకు ముందు ఎస్టీఎఫ్ఐ జెండాను సీనియర్ నాయకులు పి.విద్యాసాగర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్రెడ్డి, జి.నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, కోశాధికారి పి.వెంకటేశం, ప్రయివేట్ టీచర్స్ సంఘం బాధ్యులు పి.సోమయ్య, జిల్లా కార్యదర్శులు సిహెచ్.రామలింగయ్య, మురళయ్య, నర్సింహా, నర్రా శేఖర్రెడ్డి పాల్గొన్నారు.