Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ జలాలను బుధవారం మంత్రి పువ్వాడ అజరుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగర్ ఆయకట్టుకు ముందుగానే సాగునీటిని విడుదల చేసినట్టు తెలిపారు. ఆయకట్టులోని ప్రతి ఎకరానికీ సాగునీరు అందాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్లో సాగర్ నీటిని అందించాలని మంత్రి అన్నారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు నిరాటంకంగా 23 రోజులు ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తారని, ఆ తర్వాత ఆరు రోజులు సరఫరా ఆపేసి తర్వాత మళ్లీ 9 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారని చెప్పారు. ఈ విధంగా అవసరం మేరకు నీటి తడులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, జడ్పీ చైర్మెన్ లింగాల కమల్రాజ్, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.